video of the day

my slide show

Wednesday, September 14, 2011

పాలనలో మోడీ కింగ్, అమెరికా కాంగ్రెసు నివేదిక




Narednra Modi
వాషింగ్టన్: ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశంలో సమర్థపాలనను, ప్రతిభావంతమైన అభివృద్ధిని అందిస్తున్న రాష్ట్రంగా గుజరాత్ నిలుస్తుందని అమెరికా కాంగ్రెసు పరిశోధనా సర్వీసు నివేదిక తెలియజేస్తోంది. నరేంద్ర మోడీ నాయకత్వంలోన గుజరాత్ జాతీయ ఆర్థిక పెరుగుదలకు ఎంతో అందిస్తోందని చెప్పింది. గుజరాత్ దారిలోనే బీహార్ నడుస్తోందని చెప్పింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కూడా నివేదిక ప్రశంసలతో ముంచెత్తింది.
  Read:  In English 
మోడీ ఆర్థిక ప్రక్రియను సరైన దారిలో పెట్టారని, రెడ్ టేపిజాన్ని, అవినీతిని అరికట్టారని, దానివల్ల జాతీయ ఆర్థిక పెరుగుదలకు గుజరాత్ దోపదపడిందని నివేదిక అభిప్రాయపడింది. 94 పేజీల ఆ నివేదికను అమెరికా ప్రజాప్రతినిధుల కోసం సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేశారు. 2002 అల్లర్ల నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూనే రాష్ట్రంలో ఆధునిక రోడ్ల నిర్మాణంలో, విద్యుచ్ఛక్తి మౌలిక సదుపాయాల కల్పనలో మోడీ ముందంజవేశారని, ఇటీవలి సంవత్సరాల్లో గుజరాత్ 11 శాతం వార్షథిక పెరుగుదల రేటు సాధించిందని నివేదిక చెప్పింది. జనరల్ మోటార్స్, మిత్సుబిషి వంటి కీలకమైన సంస్థలు కూడా గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని చెప్పింది. భారతదేశంలోని మొత్తం జనాభాలో 5 శాతం మాత్రమే జనాభా ఉన్న గుజరాత్ భారత ఎగుమతుల్లో ఐదింట ఒక్క శాతాన్ని సాధించిందని చెప్పింది.

బీహార్‌లో కుల ప్రాతిపదిక రాజకీయాలను పక్కకు నెడుతూ సుపరిపాలనను అందిస్తూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారని నివేదిక ప్రశంసించింది. శాంతిభద్రతలను పరిరక్షించడంలో నితీష్ విజయం సాధించారని చెప్పింది. పౌరులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే విధంగా మౌలిక సదుపాయాలను, విద్యును అభివృద్ధి చేస్తున్నారని చెప్పింది. మోడీ, నితీష్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతికి స్ఫూర్తినిచ్చాయని చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సమస్యను కూడా నివేదిక ప్రస్తావించింది.

Thursday, June 2, 2011

తెలంగాణ ఇవ్వడమే మేలు: ఎకనామిక్ టైమ్స్ సంపాదకీయం


Telangana
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ఇదే మంచి సమయం అంటూ ఎకనమిక్ టైమ్స్ ఆంగ్ల పత్రిక తన సంపాదకీయాన్ని ప్రచురించింది. టైమ్ ఫర్ తెలంగాణ అంటూ ఓ సంపాదకీయాన్ని బుధవారం ప్రచురించింది. అందులో తెలంగాణ ఇప్పుడు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను చెప్పారు. అంతేకాదు రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెసు ఏమీ నష్టపోదని తెలంగాణలో అనూహ్యంగా బలం పుంజుకుంటుందని సీమాంధ్రలో తాత్కాలికంగా మాత్రమే ప్రభావం పడుతుందని చెప్పారు. రాష్ట్ర విభజనతో తెలంగాణకు, ఆర్థిక రంగానికి, కాంగ్రెసుకూ మేలు జరుగుతుందని స్పష్టం చేసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ ఇప్పటికి రాష్ట్రాల సంఖ్య రెండింతలకంటే ఎక్కువయ్యాయని తెలిపింది. రాష్ట్రాలు అన్ని భాషా లేదా జాతీయ ఉద్యమాల ద్వారానే ఏర్పడ్డాయని గుర్తు చేసింది.


తాజాగా ఏర్పడ్డ కొత్త రాష్ట్రాలు మాతృరాష్ట్రాల కంటే అభివృద్ధి పొందిన విషయాన్ని గుర్తు చేశాయి. గుజరాత్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు వాటి మాతృ రాష్ట్రాల కంటే ముందంజలో ఉన్నాయని స్పష్టం చేసింది. అటవీ, ఖనిజ సంపద ఉన్న తెలంగాణ కూడా ఇదే విధంగా అభివృద్ధి చెందుతుందనడంలో ఎలాంటి సంశయం అవసరం లేదని తెలిపింది. అంతేకాదు కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోక పోవడానికి ఉన్న కారణాల్లో అన్నీ తొలగిపోయాయని కూడా పేర్కొంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తెలంగాణకు బాగా వ్యతిరేకించి వ్యక్తి అని అలాంటి శక్తివంతమైన వ్యక్తి ఇప్పుడు లేరని తెలిపింది. అంతేకాదు ఇటీవలి ఉప ఎన్నికల్లో కూడా సీమాంధ్రలో జగన్ కాంగ్రెసును దెబ్బ తీసిన విషయాన్ని గుర్తు చేసింది. తెలుగుదేశం పార్టీ ఏం తేల్చుకోలేక ఊగిసలాడుతుందని తెలిపింది.


అయితే వైయస్‌కు భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగానో, అనుకూలంగానో లేరని అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండటానికి ఆయన సిద్ధంగా ఉన్నారని తెలిపింది. తెలంగాణ ఏర్పాటు వల్ల సీమాంధ్రలో జరిగే నష్టాన్ని తెలంగాణలో పూడ్చుకుంటుందని అయినప్పటికీ సీమాంధ్రలో తాత్కాలకంగా మాత్రమే ప్రభావం పడుతుందని తెలిపింది. ఒకవేళ తెలంగాణ ఇవ్వకుంటే నిత్యం రగులుతున్న అటు తెలంగాణలో, ఇటు సీమాంధ్రలో సమస్య ఉంటుందని తెలిపింది. అన్నింటికన్నా ముఖ్యంగా తెలంగాణ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏమంటే తెలంగాణ ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని బలంగా విశ్వసిస్తున్నారని తెలిపింది. తెలంగాణ ఏర్పాటుతో కోల్పోయేది కొద్దిగా అయితే వచ్చేది మాత్రం కొండంత అని తన సంపాదకీయంలో కాంగ్రెసుకు సూచించింది.